సీఎం రిలీఫ్ ఫండ్ స‌హాయం అందజేత

శేరిలింగంప‌ల్లి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హాస్పిట‌ల్ ఖ‌ర్చుల‌ను భ‌రించే స్థోమ‌త లేని ప‌లువురు సీఎం రిలీఫ్ ఫండ్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోగా ఆ ఫండ్ నుంచి మంజూరైన స‌హాయాన్ని శ‌నివారం ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ బాధితుల‌కు అంద‌జేశారు. ఈ మేర‌కు ఆయ‌న బాధితుల‌కు సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్‌వోసీ ప‌త్రాల‌ను అంద‌జేశారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ పేద‌ల‌కు స‌హాయం చేయ‌డంలో ఎప్పుడూ ముందుంటుంద‌ని అన్నారు. ఎవ‌రికి ఎలాంటి స‌మ‌స్య వ‌చ్చినా ప‌రిష్క‌రించేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు దాసరి గోపి, ఎల్లం నాయుడు పాల్గొన్నారు.

బాధితుల‌కు సీఎం రిలీఫ్ ఫండ్ స‌హాయాన్ని అంద‌జేస్తున్న ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here