హైదరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): రాష్ట్రంలో ఉన్న రెడ్డిల సమస్యలను పరిష్కరించాలని, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేయాలని కోరుతూ ఏఐఆర్ఏ ప్రతినిధులు శుక్రవారం ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు వినతిపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఆర్ఏ జాతీయ అధ్యక్షుడు నల్ల సంజీవ రెడ్డి, కోశాధికారి కాంరెడ్డి రాము, జాతీయ ఉపాధ్యాక్షురాలు కాంరెడ్డి కిరణ్మయి, తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడురు గోవర్ధన్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ ఎమ్.చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలు, రెడ్డి కార్పొరేషన్ ల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకువచ్చి సమస్యలు పరిష్కారం అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.







