ప‌ట్ట‌భ‌ద్ర ఓట‌ర్లుగా న‌మోదు చేసుకోవాలి: కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంప‌ల్లి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం విద్యావంతులు ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పేర్కొన్నారు. శనివారం మసీదుబండ‌ పర్ల్ విలేజ్ లో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ శనివారం ఇంటింటికి తిరిగి ఫాం నం 18 ను అందజేసి పట్టభద్రులతో స్వయంగా నింపించారు. పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని‌ రాగం నాగేందర్ యాదవ్ చెప్పారు. నింపిన దరఖాస్తుల‌ను పట్టభద్రులు కార్పొరేటర్ కు అందజేశారు.

ఓట‌రు న‌మోదు ప‌త్రాల‌ను స్వీక‌రిస్తున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here