శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 3 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని MA నగర్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, శేరిలింగంపల్లి ఇన్చార్జి, కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శేరిలింగంపల్లి ప్రజలపై ఆ గణేషుడి దీవెనలు ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో విలసిల్లాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.






