శేరిలింగంపల్లి, ఏప్రిల్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): బషీర్బాగ్ క్లబ్లో బీసీ ఆరాధ్య దైవం బిందెశ్వర్ ప్రసాద్ మండల్ అవార్డుల ఫంక్షన్ సమావేశానికి రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్యను బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా భేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ అవార్డుల కార్యక్రమానికి ఎంపీ ఆర్.కృష్ణయ్యను ఆహ్వానించడం జరిగిందని, ఆయన ఈ కార్యక్రమానికి హాజరవుతానని హామీ ఇచ్చారని అన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 50 శాతం వరకు ఉన్న బీసీలకు రావాల్సిన ఫలాలు అందడం లేదని, బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కచ్చితంగా ప్రతి పార్టీ 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సీనియర్ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షుడు ఒంగూరు శ్రీనివాస్ యాదవ్, బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్, శేరిలింగంపల్లి సంయుక్త కార్యదర్శి సత్యనారాయణ యాదవ్, రామకృష్ణ గౌడ్, మాధవరావు, విజయ్, మధు, కోటేశ్వరరావు, కృష్ణ, ఈశ్వర్, నరేష్ పాల్గొన్నారు.