సేవ చేసే అవకాశం కల్పించండి : ఇలియాజ్ షరీఫ్

మియపూర్ ‌‌‌(న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియపూర్ డివిజన్ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ కార్పొరేట‌ర్‌ అభ్యర్థి ఇలియాజ్ షరీఫ్ కోరారు. ప్రస్తుతం జరుగుతున్న జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కల‌సి ఆయ‌న ఆదివారం ప్రచారాన్ని కొనసాగించారు. మియాపూర్ డివిజన్ లోని మియాపూర్ న్యూ కాలనీ, లక్ష్మీ నగర్, ఓంకార్ నగర్, సుభాష్ చంద్రబోస్ నగర్, నడిగడ్డ తండా ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ ఒక్క సారి అవకాశం కల్పించాలని ఆయన కోరారు. కాంగ్రెస్ పార్టీ హ‌యాంలోనే నగరాభివృద్ధికి బాటలు పడ్డాయని, కొత్త ప్రభుత్వాలు చేసిందేమీ లేదన్నారు. ఒక స్థానికుడిగా తనకు సేవ చేసే భాగ్యం కల్పించాలని ఓటర్లను కోరుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి, అజమత్ పటేల్, అజిమ్, సాయిగౌడ్, ప్ర‌భాకర్, శేఖర్ పాల్గొన్నారు.

ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న ఇలియాజ్ ష‌రీఫ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here