శేరిలింగంపల్లి, మే 26 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల గ్రామంలో రూ.40 లక్షలతో నూతనంగా చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను కాలనీ వాసులు, జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ అధికారులతో కలిసి గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ సీసీ రోడ్ నిర్మాణ పనుల్లో నాణ్యతా విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా నాణ్యత ప్రమాణాలను పాటించే విధంగా ఎప్పటికప్పుడు అధికారుల పర్యవేక్షణ ఉండాలని అన్నారు. రాబోవు కాలంలో కాలనీ వాసులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా లెవెల్స్ సరి చూసుకుంటూ వీలైనంత త్వరగా సీసీ రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. గచ్చిబౌలి డివిజన్ లో ప్రణాళిక బద్దంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.
భవిష్యత్తులో కూడా మరిన్ని పనులు చేపట్టి కాలనీలలో మౌలిక వసతులు కల్పించి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు. గచ్చిబౌలి డివిజన్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తన దృష్టికి తీసుకువచ్చిన వెంటనే వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రజలకు మేలైన మౌలిక వసతుల కల్పనకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని తెలియజేశారు. కాలనీ అభివృద్ధికి ఎల్లవేళలా వారి సహాయ సహకారాలు ఉంటాయని కాలనీ వాసులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వసంత కుమార్ యాదవ్, గిరి, రమేష్, రంగస్వామి, చంద్రశేఖర్, సాయి కుమార్, క్రాంతి, శ్రీధర్, దిలీప్, శ్రీనివాస్, విజయ్, వినయ్ మల్లికార్జున ,పండు, రమేష్, వెంకట్, చంద్రశేఖర్, సాయి కుమార్, క్రాంతి, శ్రీధర్, దిలీప్, శ్రీనివాస్, విజయ్, వినయ్, వర్క్ ఇన్స్పెక్టర్, లక్ష్మణ్, నల్లగండ్ల గ్రామం వాసులు, స్థానిక నేతలు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.