ప్రధాని మోదీకి మహిళా‌ మోర్చా ఆధ్వర్యంలో పాలాభిషేకం

నమస్తే శేరిలింగంపల్లి: ప్రపంచ దేశాలు కరోనా, ఉక్రెన్, రష్యా యుద్ధాల కారణంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో దేశంలోని పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ ని తగ్గిస్తూ గ్యాస్ సిలిండర్ పై రూ. 200 తగ్గించేలా నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్ర బిజెపి ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు ఉప్పల ఏకాంత్ గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి సూచన మేరకు వివేకానంద నగర్ డివిజన్‌లో మేడ్చల్ అర్బన్ జిల్లా మహిళా మోర్చా సెక్రెటరీ కంటెస్టెంట్ కార్పొరేటర్ విద్యాకల్పన ఏకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సామాన్య ప్రజల ఇబ్బందుల‌ను దృష్టిలో ఉంచుకుని పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు గణేష్ గౌడ్, బిజెపి డివిజ‌న్ సెక్రటరీలు దయాకర్ రెడ్డి, జితేందర్, ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు బొట్టు శ్రీను, మార్ల శ్రీను, బిజెవైఎం ప్రధాన కార్యదర్శి సంతోష్, డివిజన్ సోషల్ మీడియా కన్వీనర్ వినోద్, డివిజన్ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి సంధ్య, ఉపేంద్ర, బిజెపి నాయకులు మహేందర్, మురళి గౌడ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

ధరల తగ్గింపు పట్ల ప్రధా‌ని మోదీకి పాలాభిషేకం చేస్తున్న మహిళా‌మోర్చా నేతలు, బిజెపి నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here