ఎస్ సేవా ఫౌండేషన్ సేవలు అభినందనీయం: కార్పొరేటర్లు పూజితజగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: విద్యార్థుల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్న ఎస్ సేవా ఫౌండేషన్ సేవలు అభినందనీయమని హఫీజ్ పెట్ డివిజన్ కార్పొరేటర్ పూజితజగదీశ్వర్ గౌడ్ అన్నారు. మదీనాగూడలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1 నుంచి 4 వ తరగతి వరకు చదివే 120 మంది విద్యార్థులకు ఎస్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా నోట్ బుక్స్, బ్యాగ్స్, పెన్నులు, భోజనం ప్లేట్లను కార్పొరేటర్లు పూజితజగదీశ్వర్ గౌడ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మోసిముద్దిన్, జనార్ధన్ గౌడ్, మల్లేష్, సాయి యాదవ్, ఫౌండేషన్ ఫౌండర్ ఎమ్.ఏ బెగ్, సభ్యులు కల్యాణి, సలీం, స్కూల్ ప్రిన్సిపల్ యూసఫ్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు నోట్ బుక్స్ ను అందజేస్తున్న కార్పొరేటర్లు పూజితజగదీశ్వర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here