సైక్లథాన్ ను ప్రారంభించిన ఎంపీ రంజిత్ రెడ్డి

నమస్తే‌ శేరిలింగంపల్లి: ఆరోగ్యమే మహాభాగ్యమని, శారీరక వ్యాయామంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చేవెళ్ల పార్లమెంట్ ‌సభ్యులు డాక్టర్ రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. వరల్డ్ హార్ట్ డే ను పురస్కరించుకొని కాంటినెంటల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ బై సైక్లింగ్ క్లబ్ సహకారంతో ఏర్పాటు చేసిన ‘సైక్లాతాన్’ ను ఎంపీ రంజిత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. దాదాపు 500 మంది సైక్లిస్టులు ర్యాలీగా వెళ్లారు. సైక్లింగ్ చేయడం ద్వారా శరీరానికి మంచి ఆరోగ్యకరమని ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. వ్యాయామం ప్రతి రోజు చేస్తూ ఆయుష్షును పెంచుకోవాలన్నారు. ఈ నెల 29 న వరల్డ్ హార్ట్ డే ఉండగా నగరంలో చాలామంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులు వీకెండ్ కావడంతో శనివారం నిర్వహించినట్లు హాస్పిటల్ డైరెక్టర్ రఘునాద్ రెడ్డి తెలిపారు.

సైక్లథాన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎంపీ రంజిత్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here