అస్వస్థతకు ‌గురైన వారికి ఎక్స్ గ్రేషియా‌ ఇవ్వాలి – బిజెపి రాష్ట్ర నాయకులు మొవ్వా సత్యనారాయణ

నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ పరిధిలోని గుట్టల బేగంపేట్ వడ్డెర బస్తీలో కలుషిత నీటిని తాగి అస్వస్థతకు గురైన బాధితులకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్స్‌ గ్రేషియా ప్రకటించాలని బిజెపి రాష్ట్ర నాయకులు మొవ్వా సత్యనారాయణ అన్నారు. కలుషిత మంచినీటిని తాగి‌ అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న బాధితులను వరుసగా మూడో‌ రోజు కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో మొవ్వా సత్యనారాయణ పరామర్శించి ఆరోగ్య పరిస్థితులను అడిగి‌ తెలుసుకున్నారు. బాధితులకు‌ ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ‌ఆయన మాట్లాడుతూ ఎలాంటి అవసరం ఉన్నా ఫోన్ చేసిన వెంటనే అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం బాధిత కుటుంబాలకు తక్షణమే ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు డీఎస్ఆర్‌కే ప్రసాద్, డాక్టర్ నరేష్, హరికృష్ణ, రఘునాధ్ యాదవ్, లీల ప్రసాద్, సాంబయ్య, వెంకటేష్, రేపన్ రాజు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో బాధితులను పరామర్శిస్తున్న మొవ్వా సత్యనారాయణ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here