విలేక‌రిని బెదిరించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి

  • శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఉప్పరి రమేష్ సాగర్ డిమాండ్

ప‌టాన్‌చెరు (నమస్తే శేరిలింగంపల్లి): వార్త విలేక‌రి సంతోష్ నాయక్ ను పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బెదిరించిన తీరును శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఉప్పరి రమేష్ సాగర్ తీవ్రంగా ఖండించారు. బాధ్యతాయుతమైన శాసనసభ్యుడిగా కొనసాగుతూ ఒక విలేకరిని అసభ్య పదజాలంతో దూషిస్తూ చంపుతానని బెదిరించడం సిగ్గుచేటని అన్నారు. తన అనుచరుల అక్రమాలు ఎండగట్టినందుకు నరుకుతా, చంపుతా అంటూ బెదిరించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. వార్తా కథనాలలో ఏవైనా పొరపాట్లు జరిగితే చట్టప్రకారం వెళ్లాలి కానీ విలేక‌రులను అసభ్య పదజాలంతో దూషించి, చంపేస్తానని బెదిరించి, వ్యక్తిగత విషయాల్లో తలదూరిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. తోటి రిపోర్టర్ సంతోష్ నాయక్ కు శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ అండగా నిలుస్తుందని, న్యాయపోరాటం కోసం ఎంత వరకైనా వెళతామని అన్నారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here