శంక‌ర‌య్య యాద‌వ్ పార్క్ ప‌నుల‌ను ప‌రిశీలించిన ఎమ్మెల్యే ఆరెక‌పూడి గాంధీ

మాదాపూర్, సెప్టెంబ‌ర్ 17 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ కాలనీలో ఎమ్మెల్యే సీడీపీ (CDP) నిధులతో రూ.8 లక్షల అంచనా వ్యయంతో శంకరయ్య యాదవ్ పార్క్ లో చేపట్టిన సుందరీకరణ పనులు పూర్తయిన సందర్భంగా మంగ‌ళ‌వారం కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ప‌నుల‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ చుట్టుపక్కల ప్రజలకు ఈ పార్క్ ఎంతగానో ఉపయోగపడుతుంద‌ని అన్నారు. చుట్టూ ప్ర‌హ‌రీ గోడ‌ను నిర్మిస్తున్నార‌ని, వాకింగ్ ట్రాక్‌ను సైతం ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. పిల్ల‌ల కోసం ఆట సామ‌గ్రిని ఏర్పాటు చేస్తున్న‌ట్లు వివ‌రించారు. పార్కును త్వ‌ర‌గా అందుబాటులోకి తీసుకు వ‌స్తామ‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోకుల్ ప్లాట్స్ నాయకులు సాంబశివరావు, బ్రిక్ శ్రీనివాస్, గుమ్మడి శ్రీనివాస్, పితాని శ్రీనివాస్, సంజీవ రెడ్డి, శివాజీ, బృందారావు, సాంబయ్య, ప్రభాకర్, కృష్ణ, అష్రాఫ్, కరీం తదితరులు పాల్గొన్నారు.

గోకుల్ ప్లాట్స్ కాల‌నీ వాసుల‌తో ఎమ్మెల్యే ఆరెక‌పూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here