నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ జేపీఎన్ నగర్ కాలనీ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ సెంటర్ను స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్తో కలిసి శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ రవి కిరణ్ గురువారం పరిశీలించారు. వ్యాక్సినేషన్ వేసేటప్పుడు చేపట్టాల్సిన జాగ్రత్తలను సిబ్బందికి వివరించారు. వ్యాక్సినేషన్ సెంటర్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. కరోనా తగ్గుముఖం పడుతున్నప్పటికీ ప్రజలు తగిన చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ను ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకువచ్చేలా టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2021/07/IMG-20210708-WA0055.jpg)