పట్టణ ప్రగతిలో పారిశుద్ద్యానికి‌ ప్రాధాన్యత- మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి‌ శ్రీకాంత్

నమస్తే శేరిలింగంపల్లి: పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత అని మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఆదేశాల మేరకు మియాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీ రంగాపురం, సాయిరాం నగర్ కాలనీలలో జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ఐదో విడత పట్టణ ప్రగతి నిర్వహించారు. కాలనీలలో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని, రోడ్లపై ఉన్న మట్టిని శానిటేషన్ సిబ్బందితో తొలగింపజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు కాలనీలలో ఉన్న చెత్తను తొలగించడం, డ్రైనేజీ వ్యవస్థను శుభ్ర పరచడం, మురికి నీటి గుంతలను తొలిగించి పరిసర ప్రాంతాలను పరిశుభ్రం చేయించామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఆర్ పీ కనకరాజు, జిహెచ్ఎంసి, సిబ్బంది కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

పట్టణ ప్రగతిలో చెత్తాచెదారాన్ని తొలగింపజేస్తున్న మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here