ముంపు ప్రాంతాల్లో పర్యటించిన కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

నమస్తే శేరిలింగంపల్లి: ఎడ తెరిపి లేకుండా అకాలంగా కురిస్తున్న భారీ వర్షాల కారణంగా అధికారులతో కలిసి ఎప్పటికప్పుడు తక్షణ చర్యలు చేపట్టడం జరుగుతుందని మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని బీకే ఎన్‌క్లేవ్ కాలనీ, మియాపూర్ బొల్లారం మెయిన్ రోడ్డు తో పాటు లోతట్టు ముంపు ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పర్యటించారు. వరుసగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. కాలనీలలో ఎక్కడ సమస్య ఉన్నా వెంటనే అక్కడికి వెళ్లాలని, సహాయక చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, వర్క్ ఇన్‌స్పెక్టర్ రఘు, జీహెచ్ఎంసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here