కొండాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికలలో రెండవ సారి కార్పొరేటర్ గా ఘన విజయం సాధించిన సందర్బంగా కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ మంత్రి హరీష్ రావు ని వసంత వ్యాలీలోని ఆయన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు గారు కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ కి శుభాకాంక్షలు తెలియజేశారు.






