శేరిలింగంపల్లి, జనవరి 26 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని మియాపూర్ బస్ స్టాప్ వద్ద మియాపూర్ 2 వీలర్స్ బైక్ రిపేర్ షాప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సీనియర్ నాయకుడు ఎండీ అన్వర్ షరీఫ్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎండీ ఇలియాజ్ షరీఫ్, అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎండీ ఫయాజ్, మహేందర్ ముదిరాజ్, ఎండీ వజీర్, సయ్యద్ మోసిన్, రాజు, ఆసిఫ్ పాల్గొన్నారు.






