రేపటి నుంచి ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశాలు

మియాపూర్‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ డివిజ‌న్ ప‌రిధిలోని ముజ‌ఫ్ఫ‌ర్ అహ్మద్ నగర్ లోని ఎంసీపీఐ(యూ) కార్యాలయంలో 2 రోజుల పాటు ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశాలు జరగనున్నాయ‌ని ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వనం సుధాకర్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. జ‌న‌వ‌రి 10, 11 తేదీల్లో స‌మావేశాల‌ను నిర్వ‌హించ‌నున్నామ‌ని తెలిపారు. ఈ స‌మావేశాల‌కు ఎంసీపీఐ(యూ) అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఎండి గౌస్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నార‌ని తెలిపారు. ఈ సమావేశాలలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు హాజరై జాతీయ, రాష్ట్ర రాజకీయ పరిణామాలపై, పార్టీ నిర్మాణం, సామాజిక నిర్మాణ అంశాలపై తగిన నిర్ణయాలు తీసుకుంటార‌ని, అలాగే భవిష్యత్ కార్యక్రమాన్ని ప్రకటిస్తార‌ని తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here