శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని గోపీ నగర్లో శనివారం కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాదయాత్ర చేశారు. బస్తీ సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజ్, రోడ్డు సమస్యలు పరిష్కరించాలని ప్రజలు ఆయనకు విన్నవించారు. వెంటనే స్పందించిన ఆయన సంబంధిత అధికారులను అక్కడికి పిలిపించి వారితో సమస్యల పరిష్కారం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయించారు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రజల అభిప్రాయం మేరకు గోపీనగర్లో నూతన సిసి రోడ్డు నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోపి నగర్ లోని అన్ని సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కృషి చేస్తానని అన్నారు. డ్రైనేజీ వ్యవస్థ శాశ్వత పరిష్కారం దిశగా అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గోపినగర్ లో ఎలాంటి సమస్యలు లేకుండా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఉపాధ్యక్షులు యాదా గౌడ్, తెరాస సీనియర్ నాయకులు కె.ఎన్ రాములు, గోపి నగర్ బస్తీ కమిటీ అధ్యక్షుడు గోపాల్, యాదవ్, లక్ష్మణ్ యాదవ్, శ్రీకాంత్ యాదవ్, తెరాస సీనియర్ నాయకులు ఎల్లదాస్, గాఫర్, శ్రీశైలం యాదవ్, ఘనపూర్ రవీందర్, పట్లోళ్ల నర్సింహారెడ్డి, ప్రభాకర్ యాదవ్ పాల్గొన్నారు.
