శేరిలింగంపల్లి, ఆగస్టు 30 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజవర్గం మియాపూర్ లక్ష్మీ నగర్, మాతృశ్రీ నగర్, ఓల్డ్ హఫీజ్పేట్ , కొండాపూర్ ప్రశాంత్ నగర్ కాలనీలలో స్థానిక నాయకుల ఆహ్వానం మేరకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు , నియోజకవర్గ ఇంచార్జ్ , కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ గణపతి మండపాలను సందర్శించి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో, ఉండాలని గణనాధుని చల్లని దీవెనలు తమపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.






