నమస్తే శేరిలింగంపల్లి: పట్టణ ప్రగతి ద్వారా పరిసరాలను పరిశుభ్రం చేసి సీజనల్ వ్యాధులు సోకకుండా తగిన జాగ్రత్తలు పాటించడం జరుగుతుందని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ తెలిపారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఇజ్జత్ నగర్ లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ పిలుపునిచ్చారు.

స్థానిక ప్రజలను కాలనీలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట వాటర్ వర్క్స్ మేనేజర్ నివర్థీ, ఎస్ఆర్ పీ శ్రీనివాస్ రెడ్డి, ప్రసాద్, చారి, జీహెచ్ఎంసీ సిబ్బంది, నాయకులు ఆంజనేయులు గౌడ్, సయ్యద్ గౌస్, సర్వర్, గంగాల శ్రీనివాస్ యాదవ్, గంగాల గణేష్ యాదవ్, శ్యామ్, సతీష్ యాదవ్, వార్డు సభ్యులు రాంచందర్, గుమ్మడి శ్రీనివాస్, నరేందర్, లోకేష్, భాస్కర్ యాదవ్, మహేష్ యాదవ్, పప్పి యాదవ్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
