శేరిలింగంపల్లి, జనవరి 29 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్, అరబిందో కాలనీ, FCI వీడియో కాలనీ, కృషి నగర్, MA నగర్, ప్రశాంత్ నగర్, నాగార్జున ఎనక్లేవ్, మక్త మహబూబ్ పెట్ విలేజ్, శ్రీ సాయి నగర్ కాలనీలలో రూ. 4 కోట్ల 72 లక్షలతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు, పలు అభివృద్ధి పనులకు కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, శేరిలింగంపల్లి నియోజకవర్గం, కాలనీ ల అభివృద్దే ధ్యేయంగా ప్రజల సౌకర్యార్థం శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పలు కాలనీల లో రూ. 4 కోట్ల 72 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని అన్నారు. కాలనీల వాసులకు ఉపశమనం లభించిందని, మౌళిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు, కాలనీల అసోసియేషన్ సభ్యులు, మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






