శ్రీ లలితాపోచమ్మ ఆలయంలో ఘనంగా నాగపంచమి

నమస్తే శేరిలింగంపల్లి: నాగులపంచమి మహోత్సవం సందర్బంగా చందానగర్ డివిజన్ పరిధిలోని వేముకుంట గౌతమి నగర్ లోని శ్రీ శ్రీ శ్రీ మహాశక్తి లలితా పోచమ్మ దేవాలయంలో ఉదయం 5 గంటల నుండి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ ట్రస్టీ, మాజీ కౌన్సిలర్ గుర్రపు రవీందర్ రావు తెలిపారు. ఆలయంలోని నాగదేవతకు, సుబ్రహ్మణ్య స్వామికి భక్తిభావంతో మొక్కులు చెల్లించుకోవడం జరిగిందన్నారు. అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించినట్లు చెప్పారు. కరోనా మహమ్మారి నుంచి విముక్తికలిగించాలని ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు గుర్రపు రవీందర్ రావు, విజయలక్ష్మి తెలిపారు. నాగుల పంచమి సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడింది.

శ్రీ లలితా పోచమ్మ ఆలయంలో భక్తుల ప్రత్యేక పూజలు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here