శేరిలింగంపల్లి, జనవరి 11 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్ డివిజన్ లోని ప్రేమ్ నగర్ బి బ్లాక్ లో బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు అల్లాఉద్దీన్ పటేల్ నిర్వహణలో నిర్వహించిన ముగ్గుల పోటీలలో చందా నగర్ మాజీ కార్పొరేటర్ నవతా రెడ్డి, శేరిలింగంపల్లి సీనియర్ నాయకులతో కలిసి శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోటీలలో విజేతలుగా నిలిచిన మహిళలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మిద్దెల మల్లారెడ్డి , రవి యాదవ్ , శ్రీనివాస్ గౌడ్ , పారునంది శ్రీకాంత్ , షాంలెట్ శ్రీనివాస్, దారుగుపల్లి నరేష్ , పెద్దగోని రమేష్ గౌడ్ , చారి , లావణ్య , కమల , సరితా , సల్మాన్ , శిరీన్ బేగం , దశరథ్ , షబ్బీర్ , మహబూబ్, కాలనీ వాసులు , మహిళలు తదితరులు పాల్గొన్నారు.






