ఖార్డ్ సంస్థ సేవలు అభినందనీయం : ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: పేద విద్యార్థులకు, పేద ప్రజలకు సామజిక సేవ కార్యక్రమాలు చేయడం చాల అభినందనీయమని, సమాజ హితం కోసం ఖార్డ్ సంస్థ సమాజ సేవలు చేయడం చాల గొప్ప విషయం అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ లో ఖార్డ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దిశ పాఠశాల విద్యార్థులకు ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీ సీఎస్ఆర్ నిధులతో స్కూల్ బ్యాగ్ లు, పుస్తకాలు, పెన్నులు, కోవిడ్ కిట్ లను విద్యార్థులకు మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, మాజీ కార్పొరేటర్ సాయి బాబా తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ సందర్బంగా గాంధీ మాట్లాడుతూ ఖార్డ్ సంస్థ వ్యవస్థాపకులు సుమన్ మల్లాది, మంజులత మల్లాది చేస్తున్న సేవలను అభినందించారు. ముత్తూట్ ఫైనాన్స్ సీఎస్ఆర్ ఫండ్ తో విద్యార్థులకు సహాయం చేయడం సంతోషకరమని అన్నారు. ప్రతి ఒక్కరు సమాజం కోసం చేయూతనందించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలోఖార్డ్ సంస్థ వ్యవస్థాపకులు సుమన్ మల్లాది, మంజులత మల్లాది, నాయకులు సాంబశివరావు, బ్రిక్ శ్రీనివాస్, గుమ్మడి శ్రీనివాస్, పితాని శ్రీనివాస్, పితాని లక్ష్మీ, అప్పారావు, సాంబయ్య, ప్రభాకర్, జేవీ రావు, వెంకయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు నోట్ బుక్స్ ను అందజేస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here