బిజెపిలో ప్ర‌తి కార్య‌క‌ర్త‌కు గుర్తింపు.. కాంచ‌న కృష్ణ నియామ‌కం అందుకు నిద‌ర్శ‌నం: మాజీ ఎమ్మెల్యే భిక్ష‌ప‌తి యాద‌వ్‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: బిజెపి ద‌ళిత మోర్చ రాష్ట్ర అధికార ప్ర‌తినిధిగా నియ‌మితులైన కాంచ‌న కృష్ణ‌కు శేరిలింగంప‌ల్లి మాజీ ఎమ్మెల్యే ఎం.భిక్ష‌ప‌తియాద‌వ్‌, పార్టీ రాష్ట్ర నాయ‌కుడు ఎం.ర‌వికుమార్‌యాద‌వ్‌లు శుభాకాంక్ష‌లు తెలిపారు. కాంచ‌న కృష్ణ గురువారం వారి నివాసంలో భిక్ష‌ప‌తి యాద‌వ్‌, ర‌వికుమార్ యాద‌వ్‌ల‌ను మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా వారు ఆమెను ఘ‌నంగా స‌న్మానించి అభినంద‌న‌లు తెలిపారు. భారతీయ జనతా పార్టీలో కొన్ని సంవత్సరాలుగా కార్యకర్త స్థాయి నుంచి కష్టపడి పని చేసినందుకు గాను కాంచన కృష్ణని తెలంగాణ అధికార ప్ర‌తినిధిగా నియమించడం అభినంద‌నీయ‌మ‌ని అన్నారు. భార‌తీయ జ‌నతా పార్టీలో ప్ర‌తీ కార్య‌క‌ర్త‌కు త‌గిన గుర్తింపు ల‌భిస్తుంద‌న‌డానికి కాంచ‌న కృష్ణ నియామ‌కం ఒక మంచి నిద‌ర్శ‌న‌మ‌ని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో పార్టీ డివిజన్ అధ్య‌క్షుడు రాజు శెట్టి, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌త్య‌ కురుమ త‌దిత‌రులు పాల్గొన్నారు.

కాంచ‌న కృష్ణ‌ను స‌న్మానిస్తున్న భిక్ష‌ప‌తి యాద‌వ్‌, ర‌వికుమార్ యాద‌వ్‌, రాజు శెట్టి, స‌త్య‌ కురుమ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here