శేరిలింగంపల్లి, డిసెంబర్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): మూడవ విడత సర్పంచ్ ఎన్నికల్లో ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ 327 ఐఎన్టియుసి స్టేట్ వైస్ ప్రెసిడెంట్, సైబర్ సిటీ సర్కిల్ రీజనల్ ప్రెసిడెంట్ కె. వెంకటేశ్వర్లు మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలో ఉన్న తన స్వగ్రామం రాజోలులో తన తల్లితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 90 ఏళ్ల వయస్సు ఉన్న తన మాతృమూర్తితో కలిసి ఓటు హక్కును వినియోగించుకోవడం ఆనందంగా ఉందన్నారు.






