మహాత్మా జ్యోతిబాపూలే జయంతి వేడుకల పోస్టర్ ఆవిష్కరణ

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: సామాజిక‌ సంఘ సంస్కర్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మహాత్మ జ్యోతిబాపూలే 195వ జయంతి ఉత్సవాలను ఈ నెల 11న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాల‌ని బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, పూలే జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ ఉప్పరి శేఖర్ సాగర్, సలహాదారులు కుందారం గణేశా చారిలు పిలుపునిచ్చారు. మహాత్మ జ్యోతిభాపూలే జయంతి ఉత్సవాలకు సంబంధించిన వాల్ పోస్ట‌ర్‌ను శుక్ర‌వారం వారు ఆవిష్కరించారు. తెలంగాణ బీసీ కులాల ఆధ్వర్యంలో ఈ నెల 11 ఆదివారం హైదరాబాద్ నగరం అంబర్ పేట్ లోని మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహం వద్ద రాష్ట్ర స్థాయి జయంతి వేడుకలను నిర్వహించనున్నట్టు వారు తెలిపారు. సామాజిక సంస్కరణల రూప కర్త మహిళలు అణగారిన వర్గాల విద్యాభివృద్ధికి కృషిచేసిన‌ మానవ హక్కుల పోరాట యోధుడు, మహాత్మ జ్యోతిబాపూలే నేటి సమాజానికి ఆదర్శనీయుడని అన్నారు. బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, బీసీ కుల సంఘాల నాయకులు హాజరు కానున్నారని తెలిపారు.బీసీలు పెద్ద సంఖ్య‌లో పాల్గొని వేడుక‌ల‌ను విజ‌య‌వంతం చేయాల‌ని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ కార్యక్రమంలో నిర్వహణ కమిటీ కో ఛైర్మన్ పి. బడేసాబ్, జాజుల లింగం, సత్యం సగర, బత్తిని రాజు, వీరమళ్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

వాల్ పోస్ట‌ర్‌ను ఆవిష్క‌రిస్తున్న బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, పూలే జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ ఉప్పరి శేఖర్ సాగర్, సలహాదారులు కుందారం గణేశా చారిలు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here