శేరిలింగంపల్లి, ఆగస్టు 15 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని చందానగర్లో ఉన్న మాధవ బృందావన్ అపార్ట్మెంట్స్ కాలనీ వాసులు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో కాలనీ వాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కాలనీ నాయకులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.






