ఘనంగా ఇజ్జత్ నగర్ భవానిమాత పోచమ్మ ఆలయ వార్షికోత్సవం – రాధాకృష్ణ యాదవ్ ప్రత్యేక పూజలు

నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ ఇజ్జత్ నగర్ విలేజ్ లో గురువారం శ్రీ భవాని మాత పోచమ్మ దేవాలయం వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటర్ గంగల రాధాకృష్ణ యాదవ్ కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. రాధాకృష్ణ దంపతులు మొదట గణపతి పూజ, ధ్వజస్తంభ ప్రతిష్ఠ, చండీ హోమం పూజలో పాల్గొన్నారు. శ్రీ పోచమ్మ తల్లిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ ధర్మకర్త గంగల నరసింహ యాదవ్, కమిటీ సభ్యులు జంగం యాదవ్, మల్లేష్ యాదవ్, నరేందర్ గౌడ్, అంజయ్య గౌడ్, సురేందర్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి తదితరులు ఆలయ వార్షికోత్సవం లో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here