హిందూముస్లింల ఐక్యతకు ప్రతీక ఇఫ్తార్ విందు – ఇఫ్తార్ విందులో ఎంపీ రంజిత్ రెడ్డి, విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: మతసామరస్యానికి ప్రతీకగా హిందూ ముస్లింల ఐక్యతకు ఇఫ్తార్ విందులు దోహద పడతాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. రంజాన్ మాసం పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరుల‌ కోసం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ లో టీఆర్ఎస్ నాయకులు సురేందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబాతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు. రంజాన్ మాసం చాలా పవిత్రమైనదని, రంజాన్ మాసంలో ముస్లింలు ఎంతో నిష్ఠతో పాటించే ఉపవాస దీక్షలు ఇఫ్తార్ విందుతో విరమించుకోవడం జరుగుతుందన్నారు. ముస్లింల అభ్యున్నతికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని అన్నారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షుడు రాజు నాయక్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు సురేందర్, చెన్నం రాజు, సత్యనారాయణ, యాదగిరి, రామారావు, నరేందర్, వెంకటేష్, అనిల్, హసన్, జాంగీర్, అప్జల్, ఆసిఫ్, తదితరులు పాల్గొన్నారు.

గచ్చిబౌలి డివిజన్ లోని ఎన్టీఆర్ నగర్ లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ప్రభుత్వ విప్ గాంధీ, మాజీ కార్పొరేటర్ సాయిబాబా

భారతి నగర్ డివిజన్ లో…
భారతి నగర్ డివిజన్ పరిధిలోని ఎంఐజీ కాలనీ లో రంజాన్ మాసం పర్వదినంను పురస్కరించుకుని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆదర్శ్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇప్తార్ విందులో చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు పండ్లు తినిపించి ఉపవాస దీక్షను విరమింపజేయించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్ , మాజీ సర్పంచ్ రాజేశ్వర్ రెడ్డి, భారతి నగర్ డివిజన్ అధ్యక్షుడు బున్, ఎంఐజీ అధ్యక్షుడు భాస్కర్, అజ్మతుల్లా, సయ్యద్ ఇయకాంత్, తిలావత్, అద్నాన్, అజమత్, నర్సింహా, సునీల్, బాక్సర్ గిరి, సంపత్ గౌడ్, రాకేష్, వెంకట్, సురేందర్, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

భారతి నగర్ డివిజన్ ఎంఐజీలో ఆదర్శ్ రెడ్డి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్హొన్న ఎంపీ రంజిత్ రెడ్డి, విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here