శేరిలింగంపల్లి, మే 2 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని మైత్రి నగర్ శ్రీ శ్రీ శ్రీ అలివేలు మంగా పద్మావతీ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానము లో శ్రీ శ్రీ శ్రీ అలివేలు మంగా పద్మావతీ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సువర్ణ కిరీట ధారణ మహోత్సవం కార్యక్రమంలో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు . ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సువర్ణ కిరీట ధారణ మహోత్సవం కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందని, వెంకటేశ్వర స్వామి వారి కృపా కటాక్షాలతో ప్రజలందరు సుఖ సంతోషాలతో ఉండాలని, స్వామి వారి కృప ప్రజలందరి పై ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, లక్ష్మారెడ్డి, మైత్రి నగర్ దేవాలయ కమిటీ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యేశ్వర రావు , జనరల్ సెక్రెటరీ భక్తవచ్చల రెడ్డి, ట్రెజరర్ రామకృష్ణ , వైస్ ప్రెసిడెంట్స్ భిక్షపతి, మధుసూదన్ రెడ్డి, GVS రామారావు, శ్రీనివాసులు రెడ్డి, జాయింట్ సెక్రటరీలు పూర్ణా నంద, శరత్, సురేష్, ఆర్గనైజింగ్ సెక్రెటరీలు నాగ రమేష్, సుధాకర్ రావు, చంద్రశేఖర్, చీఫ్ అడ్వైజర్లు బిజ్జమ్ వెంకటేశ్వర రెడ్డి, కంది వెంకటేశ్వర రెడ్డి, చెన్నా రెడ్డి, మోహన్ రావు, రామ లక్ష్మణరావు, కన్నగాళ్ళ శ్రీనివాసరావు, సత్యనారాయణ రెడ్డి, సంజీవయ్య, సుబ్బారావు, వెంకట రాఘవయ్య తదితరులు పాల్గొన్నారు.