హఫీజ్పేట (నమస్తే శేరిలింగంపల్లి): అయోధ్యలో శ్రీభవ్య రామమందిర నిర్మాణానికి హఫీజ్పేటలోని హనుమాన్ యూత్ అసోసియేషన్, హఫీజ్ పేట గ్రామ యువకులు గ్రామ౦, గ్రామ ప్రజల తరఫున వినాయకుడి లడ్డూ వేలం పాట నిధుల నుండి రూ.51వేల నిధిని సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నగర సంఘ్ చాలక్ రామ్ సింగ్, సేవా ప్రముఖ కృష్ణారెడ్డి, నగర కార్యవాహ మోహన్, నగర సహా సంయోజక్ వంశీ కృష్ణ, యాదగిరిగౌడ్, కృష్ణా ముదిరాజ్, వెంకటేష్ గౌడ్, గౌతమ్ గౌడ్, మహేష్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, నరేందర్ గౌడ్, మన్నె వెంకటేష్, కుమ్మరి శ్రీనివాస్, ఆర్ మల్లేశ్, చంద్రమోహన్, దేవేందర్ ముదిరాజ్, శ్రీధర్ గౌడ్, పాండు ముదిరాజ్, వేణు, రాధాకృష్ణ, టీ నరేష్, మల్లేష్ యాదవ్, హెచ్ ప్రవీణ్, దిలీప్, పరమేష్, రాకేష్ గౌడ్, మనోజ్ యాదవ్, సుధాకర్, రాజ్ కుమార్, గ్రామ యువకులు పాల్గొన్నారు.







