దశల వారీగా సమస్యలను పరిష్కరిస్తాం – ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: కాలనీలో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ చెప్పారు. హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని గెజిటెడ్ ఆఫీసర్స్ కాలనీలో కార్పొరేటర్లు పూజితజగదీశ్వర్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్ ‌తో కలిసి ప్రభుత్వ విప్ గాంధీ మంగళవారం పర్యటించారు. కాలనీలో నెలకొన్న సమస్యలను, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అడిగి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. రోడ్ల నిర్మాణం, పార్క్ లను అభివృద్ధి చేయాలని, వీధి దీపాలు, ఎలక్ట్రికల్ తదితర సమస్యలను కాలనీ వాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ కాలనీలో దశల వారీగా అభివృద్ధి పనులు చేపట్టి సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో హఫీజ్ పెట్ డివిజన్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ నాయకులు వెంకటేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, విక్రమ్, గెజిటెడ్ ఆఫీసర్స్ కాలనీ వాసులు శ్రీనివాస్, త్రినాద్, రవి, సుబ్బు, జగదీశ్వర్, శ్రీధర్, శివ, వనమ రాజు, సత్య, రీతూ, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

హఫీజ్ పేట డివిజన్ గెజిటెడ్ ఆఫీసర్స్ కాలనీలో సమస్యలు తెలుసుకుంటున్న ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్లు పూజితజగదీశ్వర్ గౌడ్

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here