శేరిలింగంపల్లి, ఏప్రిల్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్బంగా మక్తా మహబూబ్ పేటలో ఆయన విగ్రహానికి స్థానిక నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు జి.జీతయ్య, కొంచ శివరాజ్, కె.చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.






