ఆర్‌బీఆర్ ట‌వ‌ర్స్ వినాయ‌కుడి లడ్డూ రూ.1,33,500/-

  1. శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 18 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని మియాపూర్ ఆర్‌బీఆర్ ట‌వ‌ర్స్ వెల్ఫేర్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో స్థానికంగా ఏర్పాటు చేసిన గ‌ణేష్ మండ‌పం వ‌ద్ద బుధ‌వారం ల‌డ్డూ వేలం పాట నిర్వ‌హించారు. ఇందులో స్థానికంగా ఉన్న దాస‌రి అంజి రెడ్డి పాల్గొని గ‌ణేషుడి ల‌డ్డూను వేలం పాట‌లో రూ.1,33,500 కు ద‌క్కించుకున్నారు. అనంత‌రం వినాయ‌కుడి నిమ‌జ్జ‌నోత్స‌వాన్ని స్థానిక గుర్నాథ్ చెరువులో అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆర్‌బీఆర్ ట‌వ‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు రాచ‌మ‌ళ్ల ఓం ప్ర‌కాష్ గౌడ్‌, కృష్ణ ప‌టేల్‌, నాగేశ్వ‌ర్ గౌడ్‌, భాస్క‌ర్ గౌడ్‌, అసోసియేష‌న్ స‌భ్యులు సురేష్ కుమార్‌, గోవింద్ నాయ‌క్‌, ర‌మ‌ణ‌, వాసు, అంజిరెడ్డి, విజ‌య్‌, కృష్ణ మోహ‌న్‌, ప్ర‌తాప్ రెడ్డి, ఆర్‌కే రెడ్డి, న‌వ‌త‌, స్థానికులు అధిక సంఖ్య‌లో పాల్గొన్నారు.
పూజ‌ల్లో పాల్గొన్న అసోసియేష‌న్ స‌భ్యులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here