ప‌ట్ట‌భ‌ద్రులు ఓట‌ర్లుగా న‌మోదు చేసుకోవాలి: కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి

చందాన‌గ‌ర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ బలప‌రిచిన‌ అభ్యర్థులను గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చందానగర్ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు భవానీపురం కాలనీ యూత్ సభ్యులకు బుధ‌వారం ఆమె దరఖాస్తు ఫాంలను అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ… గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమంలో అర్హులైన ప్రతీ గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదయ్యే విధంగా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ ఎన్నికల్లో అధిష్టానం బలపర్చిన అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా సభ్యులు పనిచేయాలని, తెరాస‌ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆదేశాలు, శేరిలింగంపల్లి శాసనసభ్యుడు గాంధీ సూచనల మేరకు చందానగర్ డివిజన్ పరిధిలో ఉన్న పట్టభద్రులను గుర్తించి భారీగా ఓటరు నమోదులో పాల్గొనేలా చురుకుగా పని చేయాలన్నారు.

ఓట‌రు న‌మోదు ప‌త్రాల‌ను అందజేసిన కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి

2017 సంవత్సరం నాటికి డిగ్రీ పూర్తి చేసిన వారిని గుర్తించి ఓటు నమోదు చేసుకునేందుకు దరఖాస్తు (ఫాం 18)తో పాటు ధ్రువీకరణ పత్రాలను సిద్ధంగా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో భవానీపురం ప్రెసిడెంట్ రఘునందన్ రెడ్డి, లక్ష్మీపతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ప‌ట్ట‌భ‌ద్రుల ఓట‌రు న‌మోదుపై అవ‌గాహ‌న క‌ల్పిస్తున్న కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here