నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్పేట్లోని హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆద్వర్యంలో కొనసాగుతున్న శ్రీ వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధానంగా గోమాత పూజ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. వినాయకుడి సన్నిదిలో గ్రామ ప్రముఖులు, టీఆర్ఎస్ సీనియరర్ నాయకుడు బాలింగ్ యాదగిరి గౌడ్ దంపతులు గోపూజ నిర్వహించగా ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గోమాతను దర్శించుకున్నారు. సకల దేవతలకు ఆవసమైన కామదేనువు ఆశీర్వాదం పొంది భక్తులు తన్మయత్వం పొందారని యాదగిరి గౌడ్ పేర్కొన్నారు.