ప‌చ్చ‌ద‌నం పెంపొందిస్తే ప‌రిస‌ర ప్ర‌జ‌ల‌ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది: కసిరెడ్డి భాస్కరరెడ్డి

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: చెట్లను కాపాడి, అభివృద్ధి చేస్తే, అవి మనలను కాపాడుతాయని బిజెపి రాష్ట్ర నేత కసిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శనివారం గౌతమీనగర్ పార్కు స్థలంలో బిజెపి చందానగర్ కాంటెస్టెడ్ కార్పొరేట‌ర్‌ కసిరెడ్డి సింధూ రఘునాథ్ రెడ్డితో కలిసి క‌సిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి మొక్కలు నాటారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ కాలనీల్లో పార్కు స్థలాలు, కామన్ ఏరియాలను కాపాడుకోవాలని కాలనీ అసోసియేషన్లకు క‌సిరెడ్డి పిలుపునిచ్చారు. పచ్చదనం పెంపొందిస్తే ఆరోగ్యాలు మెరుగుప‌డ‌తాయ‌ని, కరోనాలాంటి విపత్తులు రాకుండా ఉండాలంటే మరింత కృషి చేయడం అవసరం అని అన్నారు. ఈ కార్యక్రమంలో గౌతమీ నగర్ కాలనీ అధ్యక్షుడు నూనె సురేందర్, నాయ‌కులు కసిరెడ్డి రఘునాథ్ రెడ్డి, కాసం రామస్వామి, చిలకమర్రి శ్రీనివాస్ రెడ్డి, ఇంజ పర్వత్ రెడ్డి, ఆదిశేషయ్య తదితరులు పాల్గొన్నారు.

గౌత‌మిన‌గ‌ర్ పార్కులో మొక్క‌లు నాటుతున్న క‌సిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి, సింధు ర‌ఘునాథ్‌రెడ్డి, నూనె సురేంద‌ర్ త‌దిత‌రులు

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here