అభివృద్ది ప‌నుల‌ను త్వ‌ర‌గా పూర్తి చేస్తాం: జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 10 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప‌క్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంద‌ని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ లో శంకర్ యాదవ్ పార్కును పరిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల‌కు ఎల్ల‌ప్పుడూ అందుబాటులో ఉంటామ‌న్నారు. స‌మ‌స్య‌లను ప‌రిష్క‌రించేందుకు చొర‌వ చూపిస్తామ‌న్నారు. డివిజ‌న్ ప‌రిధిలో అభివృద్ధి ప‌నుల‌ను త్వ‌ర‌గా పూర్తి చేస్తామ‌న్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మన్నెపల్లి సాంబశివరావు, లక్ష్మీ, శ్రీనివాస్, ప్రసాద్, పితాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

పార్కును ప‌రిశీలిస్తున్న జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here