పక్కా ప్రణాళికతో అభివృద్ధి పనులు – జీహెచ్ఎంసీ ‌కౌన్సిల్ సమావేశంలో మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశంలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ అన్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు. కౌన్సిల్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ మాట్లాడారు. జీహెచ్ఎంసీ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులు ప్రపంచ సంస్థలను ఆకర్షించేలా ఉన్నాయని అన్నారు. నగర ప్రజలకు మెరుగైన మౌళికవసతులు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతుందన్నారు. పక్కా ప్రణాళికతో గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. ప్రజలకు మెరుగైన రవాణా వ్యవస్థను మెరుగు పరిచేలా ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని చేపటాల్సిన ప్రధాన అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు.

జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం లో మాట్లాడుతున్న మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here