చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రెడ్డి రఘునాథ్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెరాస నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, సీనియర్ నాయకుడు మిరియాల రాఘవ రావు, మాజీ కౌన్సిలర్లు రఘుపతి రెడ్డి, రవీందర్ రావు, సునీత ప్రభాకర్ రెడ్డి, వెంకట్ రావు, గురుచరణ్ దూబే, జనార్దన్ రెడ్డి, సుప్రజ ప్రవీణ్, అక్బర్ ఖాన్, ఓర్సు వెంకటేశ్వర్లు, పబ్బ మల్లేష్, గోపి, ఎల్లమయ్య, దాస్, కొండల్ పాల్గొన్నారు.







