మాదాపూర్ డివిజన్ పరిధిలో అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 31 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్, సుభాష్ చంద్రబోస్ నగర్, భిక్షపతి నగర్, కృష్ణ నగర్, శిల్ప హిల్స్, ఇజ్జత్ నగర్, అయ్యప్ప సొసైటీ, మాతృ శ్రీ నగర్, సైబర్ హిల్స్, హనుమాన్ నగర్, జూబ్లీ గార్డెన్, దీప్తి హిల్స్ , నవ భారత్ నగర్, సిద్ధివినాయక నగర్ కాలనీలలో రూ. 14 కోట్ల 35 లక్షల 40 వేలతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్లు, BT రోడ్లు, శ్మ‌శాన వాటికలు, వరద నీటి కాలువ‌ నిర్మాణం పనులకు కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, శేరిలింగంపల్లి నియోజకవర్గం, కాలనీ ల అభివృద్దే ధ్యేయంగా ప్రజల సౌకర్యార్థం ఆయా కాలనీలలో నూతనంగా చేపట్టబోయే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకోవడం జరిగింద‌ని అన్నారు. సీసీ, బీటీ రోడ్ల పనులకు, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని అన్నారు. మౌళిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు, కాలనీల అసోసియేషన్ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here