వరద నీటి కాలువ నిర్మాణం పనులను త్వ‌ర‌గా పూర్తి చేయాలి: కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

శేరిలింగంపల్లి, మే 26 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని పటేల్ చెరువు సమీపంలో నూతనంగా నిర్మాణం చేపట్టబోయే (Storm water drain) వరద నీటి కాలువ నిర్మాణం పనులను చేపట్టే పరిసర ప్రాంతాలను GHMC ఇంజనీరింగ్ విభాగం అధికారులు, ఇరిగేషన్ విభాగం అధికారులతో కలిసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. వరద ముంపు సమస్య శాశ్వత పరిష్కారం దిశగా వరద నీటి కాల్వ నిర్మాణం పనులను చేపట్టే పరిసర ప్రాంతాలను పలు సంబంధిత శాఖల అధికారులతో కలసి పరిశీలించడం జరిగిందని, వరద నీరు కాల్వ నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేసి నీటి ప్రవాహం సాఫీగా సాగేలా చూడాలని , రాబోయే వర్షాకాలంను దృష్టిలో పెట్టుకొని పనులలో జాప్యం లేకుండా, వర్షాకాలం లోపు పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో GHMC అధికారులు AE సంతోష్, ఇరిగేషన్ అధికారులు AE పావని, కాలనీ వాసులు రాము, చైతన్య, వెంకటేశ్వర్లు, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here