శేరిలింగంపల్లి, ఏప్రిల్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): బి.ఆర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని ఎనలేని దేశ సేవను గుర్తుచేసుకోవాలని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి, గ్రేటర్ హైదరాబాద్ స్టాండింగ్ కమిటీ సభ్యుడు వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. డా.బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఆయనకి ఘన నివాళులు అర్పించారు. చందానగర్ డివిజన్ పరిధిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ఆయన విగ్రహానికి జగదీశ్వర్ గౌడ్ నియోజకవర్గ నాయకులు, డివిజన్ నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చడానికి కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు, నియోజకవర్గం నాయకులు, డివిజన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మాదాపూర్లో..
మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఇజ్జత్ నగర్ వీకర్ సెక్షన్ లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి, గ్రేటర్ హైదరాబాద్ స్టాండింగ్ కమిటీ సభ్యుడు వి.జగదీశ్వర్ గౌడ్ నియోజకవర్గ నాయకులు, డివిజన్ నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు, డివిజన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.