ప్ర‌తి కాల‌నీ, బ‌స్తీ అభివృద్దే ల‌క్ష్యం: కార్పొరేట‌ర్ ఉప్ప‌ల‌పాటి శ్రీ‌కాంత్

మియాపూర్‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ డివిజ‌న్ ప‌రిధిలోని ప్ర‌తి కాల‌నీ, బ‌స్తీ అభివృద్ధే ల‌క్ష్యంగా ముందుకు సాగుతున్నామ‌ని డివిజ‌న్ కార్పొరేట‌ర్ ఉప్ప‌ల‌పాటి శ్రీ‌కాంత్ అన్నారు. మంగ‌ళ‌వారం డివిజ‌న్ ప‌రిధిలోని ఎంఏ న‌గ‌ర్‌లో కొన‌సాగుతున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ ప‌నుల‌ను ఆయ‌న స్థానికులు, జీహెచ్ఎంసీ అధికారుల‌తో క‌లిసి ప‌రిశీలించారు.

ఎంఏ న‌గ‌ర్‌లో ప‌ర్య‌టిస్తున్న కార్పొరేట‌ర్ ఉప్ప‌ల‌పాటి శ్రీ‌కాంత్

ఈ సంద‌ర్భంగా కార్పొరేట‌ర్ ఉప్ప‌ల‌పాటి శ్రీ‌కాంత్ మాట్లాడుతూ డివిజ‌న్‌లో పెండింగ్‌లో ఉన్న ప‌నుల‌ను త్వ‌ర‌గా పూర్తి చేసి ప్ర‌జ‌ల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా చూస్తామ‌న్నారు. ప్ర‌జ‌ల‌కు మెరుగైన మౌలిక వ‌స‌తుల‌ను క‌ల్పిస్తామ‌ని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో ఏఈ ర‌మేష్‌, వ‌ర్క్ ఇన్‌స్పెక్ట‌ర్ ప్రేమ్‌, నాయ‌కులు ర‌వి, సెంట్రింగ్ రాజు, జంగం మ‌ల్లేష్, వెంక‌టేష్‌, డ్రైవ‌ర్ రాజు, శివ ముదిరాజ్‌, కోనేరు య‌శ్వంత్ పాల్గొన్నారు.

స్థానికుల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటున్న కార్పొరేట‌ర్ ఉప్ప‌ల‌పాటి శ్రీ‌కాంత్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here