శేరిలింగంపల్లి, మార్చి 12 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎఫ్ సి ఐ కాలనీలోని హరిక టవర్స్ అపార్ట్మెంట్స్ అసోసియేషన్ సభ్యులు పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. అపార్ట్మెంట్స్ లో తలెత్తిన సమస్యలను స్వయంగా వెళ్లి పరిశీలించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి, PAC ఛైర్మెన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సహకారంతో సమస్యలను విడతల వారిగా త్వరలోనే పరిష్కరిస్తామని అన్నారు. డ్రైనేజీ, మంజీర మంచినీటి వసతులను మెరుగుపరుస్తామని, మియాపూర్ డివిజన్లో ప్రతి కాలనీలో చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ మహిళా అధ్యక్షురాలు సుప్రజ,హరిక టవర్స్ అపార్ట్మెంట్స్ అసోసియేషన్ సభ్యులు మూర్తి , పార్ద, శివ, నరేంద్ర, నవీన్, సాయికిరణ్, సీతారామశాస్త్రి, చంద్రశేఖర్, నరసింహ మూర్తి, రమేష్, శ్రీకాంత్, అపార్ట్మెంట్స్ వాసులు తదితరులు పాల్గొన్నారు.