శేరిలింగంపల్లి, జనవరి 25 (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని TNGO’S కాలనీ వాసులు పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని వివేకానంద నగర్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. దీనిపై PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ త్వరలోనే TNGO’S కాలనీలో పర్యటిస్తానని, TNGO’S కాలనీలో నెలకొన్న అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్ల సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని అన్నారు. త్వరలోనే సీసీ రోడ్డు ఏర్పాటు చేస్తామని, కాలనీలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించామని, అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్లను అతి త్వరలో చేపట్టి ప్రజలకు అందుబాటులో కి తీసుకువస్తామని అన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని, అన్ని రోడ్లను దశల వారిగా చేపట్టి పూర్తి స్థాయిలో రోడ్ల నిర్మాణం పనులు చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజ్, నాయకులు మంత్రిప్రగడ సత్యనారాయణ రావు,వేణు గోపాల్ రెడ్డి, శ్రీనివాస్,సల్లావుద్దీన్, TNGO’ S కాలనీ వాసులు సుధాకర్, సంజీవయ్య, హనుమ, సాయి రెడ్డి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
