శేరిలింగంపల్లి, ఏప్రిల్ 4 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీల గార్డెన్ కాలనీలోని లక్ష్మీ ఇంపీరియా అపార్ట్మెంట్స్ వెల్ఫేర్ అసొసియేషన్ కు నూతనంగా ఎన్నుకోబడిన అసొసియేషన్ కార్యవర్గ సభ్యులు మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ మాట్లాడుతూ.. శ్రీల గార్డెన్ కాలనీలోని లక్ష్మీ ఇంపీరియా అపార్ట్మెంట్స్ వెల్ఫేర్ అసొసియేషన్ కు నూతనంగా ఎన్నుకోబడిన అసోసియేషన్ సభ్యులను అభినందించడం జరిగినదని, లక్ష్మీ ఇంపీరియా అపార్ట్మెంట్స్ వెల్ఫేర్ అసొసియేషన్ అభివృద్ధికి కృషి చేస్తానని, ఏ చిన్న సమస్య ఉన్న తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని అన్నారు. అదేవిధంగా అపార్ట్మెంట్ లోని ప్రతి ఒక్కరి సమస్యల పై స్పందిస్తూ ప్రతి ఒక్కరు సమిష్టిగా కలిసి అభివృద్ధికి పాటుపడాలని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో లక్ష్మీ ఇంపీరియా అపార్ట్మెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జనార్ధన్, అసోసియేషన్ సభ్యులు రాజేందర్ నాయుడు, సతీష్ బాబు, మధుకర్ రెడ్డి, సుబ్బారావు, శంకర్ ఆనంద్, రమేష్ , వీరయ్య చౌదరి, వెంకట్, రాజేష్, ముప్పరాజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.